Search for:
  • Home/
  • क्षेत्र/
  • అధికారులతో సమీక్షించి కాలనీవాసుల సమస్యను పరిష్కరిస్తా: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి

అధికారులతో సమీక్షించి కాలనీవాసుల సమస్యను పరిష్కరిస్తా: కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్)

 

హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డివిజన్ లోని వర్ధయ్య కాలనీలో పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కాలనీలో ఉన్నటువంటి వర్షపు నీరు పైప్ లైన్ కు అవుట్ లైన్ కనెక్టివిటీ లేకపోవడంతో వరద నీరు కాలువలో కాకుండా ఏక్కడో డ్రైనేజీ నీరు కలవడం వలన కాలనీలోని ఖాళీ ప్రదేశాలలో మురుగు నీరు చేరి, కాలనీలో దుర్వాసన మరియు విపరీతమైన దోమలతో కాలనీ వాసులు అనారోగ్యo బారిన పడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు తెలపడంతో కార్పొరేటర్ తక్షణమే స్పందించి అధికారులతో సమీక్షించి కాలనీ వాసుల సమస్యను పరిష్కరిస్తానని కాలనీ వాసులకు తెలపడం జరిగిందన్నారు.

 

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు వర్ధరాజ్, వెంకట్ రెడ్డి, వెంకట్ చారి, వెంకటేశ్వర్ రావు, ఖయ్యూం, లింగమ్మ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required