కేవిఆర్ వెంటే అందెల, వాకర్స్ తో చిట్ చాట్
కేవిఆర్ కి సంపూర్ణ మద్దతు తెలిపిన పాదచారులు
రంగారెడ్డి: మే 8(భారత్ కి బాత్)
బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బడంగ్ పేటలోని సిరిపురం యాదయ్య క్రీడా ప్రాంగణంలో మార్నింగ్ వాకర్స్ ని కలిసి వారితో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడిన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వశ్వర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్. ఈ సందర్భంగా చిన్నారులతో, క్రీడా కారులతో కలిసి మాట్లాడి వాళ్ళతో సరదాగా ఆటలు ఆడారు. అనంతరం బాలాపూర్ నక్షత్ర కాలనీలోని పలువురు ఉన్నత ఉద్యోగులను కలసిన కేవీఆర్, అందెల. ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్ లో పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వెయ్యాలని అభ్యర్ధించారు.