Search for:
  • Home/
  • क्षेत्र/
  • తెలంగాణ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి

తెలంగాణ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి

హైదరాబాద్: అక్టోబర్ 27(భారత్ కి బాత్)

ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో ఆదివారం నాడు సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సదర్ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర టియుఎఫ్ఐడీసీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చల్లా బాల్ రెడ్డి. ఈ సందర్భంగా చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ సదర్ సమ్మేళనం అనేది కేవలం యాదవులకి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కలిసి జరుపుకునే పండుగ అని తెలిపారు. సమైక్యత భావంతో అందరూ ముందుకు వెళ్లాలని, కలిసికట్టుగా అభివృద్ధి పథంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Comment

All fields marked with an asterisk (*) are required