ప్రేరణ హిందీ ప్రచారిణి సభ భారత్ వారి హిందీ అభియాన్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లో విజయవంతంగా జరిగింది..
హిందీ ని రాష్ట్ర భాష చేయాలని సంకల్పం తో ముందుకు పోతున్న సంస్థ ప్రేరణ హిందీ ప్రచారిణి సభ. ఈ సంస్థ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధి లోని శ్రీ సాయి చైతన్య హైస్కూల్ లో హిందీ ప్రచార కార్యక్రమము ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిందీ వ్యాకరణ పాఠాలు విద్యార్థులకు బోధించారు. ప్రేరణ హిందీ ప్రచారిణి సభ భారత్ సలహకారుడు డా. గుండాల విజయ [...]