Search for:
  • Home/
  • क्षेत्र/
  • నాలుగు మండల కేంద్రాలలో ఆధార్ సెంటర్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలి: పద్మ అనిల్ ముదిరాజ్

నాలుగు మండల కేంద్రాలలో ఆధార్ సెంటర్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలి: పద్మ అనిల్ ముదిరాజ్

ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు: బీజేవైఎం నాయకులు 

 

రంగారెడ్డి: ఫిబ్రవరి 25(భారత్ కి బాత్)

 

ఆమనగల్లు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మ అనిల్ ముదిరాజ్ మాట్లాడుతూ కల్వకుర్తి తాలూకలోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండల కేంద్రాలలో ఆధార్ సెంటర్స్ లేక నాలుగు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పిల్లలకు నూతన ఆధార్ కార్డులు తీయాలన్నా, పేరు, అడ్రస్, మార్చాలన్నా, ప్రస్తుతం అందరి ఆధార్ కార్డులలో అడ్రస్, జిల్లా మహబూబ్ నగర్, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉందని, వాటిని అప్డేట్ చేయించాలంటే, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్దండ, కల్వకుర్తి, ఊరుకొండ పేట, మిడ్జిల్, జడ్చర్ల మండలాలకు వెళ్లాల్సి వస్తుందని, అక్కడ ఆధార్ సెంటర్ల దగ్గర జనాలు ఎక్కువగా ఉండటంతో రెండు లేదా మూడు సార్లు వెళ్ళవలసి వస్తుందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కావున 4 మండల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి ఆధార్ సెంటర్స్ ను ఏర్పాటు చేయవలసిందిగా బీజేవైఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ అవసరమయ్యే ఈ డిమాండ్ ను నెరవేర్చని పక్షంలో, బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసనలు, నిరాహార దీక్షలు, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్, బీజేవైఎం నాయకులు మండల ప్రధాన కార్యదర్శులు వరికిప్పల రాఘవేందర్, దేరంగుల శేఖర్, కార్యదర్శి శ్రీహరి, యాదగిరి పాల్గొన్నారు.

 

Leave A Comment

All fields marked with an asterisk (*) are required