క్రికెట్ బాక్స్ ను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: ఫిబ్రవరి 23(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మున్సిపాలిటీ వాదే ఉమర్ కాలనీలో బాక్స్ క్రికెట్ ను ప్రారంభించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడారంగంపై దృష్టి మరల్చడానికి ఇదో గొప్ప ప్రయత్నమని, యువత అన్ని రంగాల్లో రాణించాలని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. యజమానులు మొహమ్మద్ జిలనీ, సుల్తాన్ అలీ, అదీబ్ అహ్మద్ లు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకి దూరంగా ఉండాలని అన్నారు. క్రికెట్ బాక్స్ గంటకి 500/- రూపాయలు, శని, ఆదివారాల్లో 600/- రూపాయలు అని, ఓపెనింగ్ ఆఫర్ అలాగే రంజాన్ అయిపోయేవరకు గంటకు 400/- రూపాయలు అని తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అబ్దుల్లా సాధి, మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ యూసుఫ్ పటేల్, శంషుద్దీన్, దస్తగిరి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంషుద్దీన్, హమీద్ అలీ, మన్సూరి, మిరాజ్ భాయ్, మతిన్ పటేల్, సయ్యద్ జిషన్, మగ్దూం బాయ్, మాహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, జల్ పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అబ్బాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.