ప్రశాంతి హిల్స్ లో నూతనంగా ప్రారంభమైన విగ్నేశ్వర జ్యువెలర్స్
రంగారెడ్డి: ఫిబ్రవరి 15(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం నంది హిల్స్ లోని, ప్రశాంతి హిల్స్ లో శనివారం నాడు నూతనంగా ప్రారంభమైన విగ్నేశ్వర జ్యువెలర్స్. ఈ సందర్భంగా యజమాని వేణు మాట్లాడుతూ నూతనంగా బంగారం షాపును ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. అలాగే మా వద్ద రెడీమేడ్ బంగారు గొలుసులు, నెక్లెస్ లు ఉన్నాయని, 916 kdm బంగారం ఆర్డర్ పై కూడా తయారు చేస్తామని అన్నారు. బంగారం మరియు వెండికి సంబంధించిన అన్ని వస్తువులు లభిస్తాయని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నామని, వినియోగదారుల సంతృప్తి మాకు ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.