Search for:
  • Home/
  • क्षेत्र/
  • సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 20(భారత్ కి బాత్)

ఎల్.బి. నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆదివారం నాడు వారి నివాసంలో డివిజన్ బీజేపీ శ్రేణులతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 45 రోజుల్లోనే 9 కోట్లకు పైగా సభ్యత్వాలతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీల్లో ఒకటిగా బీజేపీ ఎదిగిందని, దీనికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అని, అందుకే బీజేపీకి ప్రజలు మళ్ళీ మళ్ళీ అధికారం ఇస్తూ, ఆదరిస్తున్నారని తెలిపారు. వీటన్నిటికీ మూలం సైనికుల్లాంటి కార్యకర్తలని అన్నారు. కావున హయత్ నగర్ డివిజన్ బీజేపీ శ్రేణులు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో మరింత వేగవంతం పెంచాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, డివిజన్ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప, డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంఘీ అశోక్, గోవింద చారి, ఇతర సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required