Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఆమనగల్లులో ఎక్సైజ్ శాఖ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్లులో ఎక్సైజ్ శాఖ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్: జనవరి 5(భారత్ కి బాత్)

శుక్రవారం నాడు ఆమనగల్ పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ బధ్యానాద్ చౌహన్, సిబ్బంది పుష్పగుచ్చాం అందజేసి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఆమనగల్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయం నిర్మించేందుకు సర్వేనంబర్ 429 లో 9 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్యే కసిరెడ్డికి సీఐ బధ్యనాధ్ చౌహన్ వివరించారు. కార్యాలయ నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ దీనిపై అధికారులతో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ శాఖ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required